బుద్ధుడి భూమిలో రాక్షస పాలన

బుద్ధుడి భూమిలో రాక్షస పాలన

న్యూ ఢిల్లీ: ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకుని నేరగాళ్లు అన్ని పరిమితులూ దాటేశారని మాజీ ముఖ్యమంత్రి రబ్రిదేవి సోమవారం ట్విట్టర్లో ధ్వజమెత్తారు. శుక్రవారం బెట్టియాలో జరిగిన సామూహిక అత్యాచారంపై తీవ్రంగా స్పందించారు. ‘బీహార్లోని రాక్షస ప్రభుత్వం నేరగాళ్లకు వెన్నుదన్నుగా నిలిచింది. ప్రభుత్వం అండతో నేరగాళ్లు బరితెగిస్తున్నారు. ముజఫరాబాద్ షెల్టర్ హోమ్లో అత్యాచారానికి గురైన ఓ బాలిక బీహార్లో మరోసారి సామూహిక అత్యా చారానికి గురైంది. బీహార్లో తల్లులకు, అక్క చెల్లెళ్లకు, కుమార్తెలకు గౌరవం, భద్రత లేకుండా పోయాయి. ఈ ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైంద’ని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos