నన్ను వాళ్ళు రేప్ చేయలేదు..

నన్ను వాళ్ళు రేప్ చేయలేదు..

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మిర్యాలగూడకు చెందిన పాతికేళ్ల యువతి రేప్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.గత తొమ్మిది సంవత్సరాలుగా తన పై అయిదు వేల సార్లకి పైగా అత్యాచారం జరిగిందని తనని అత్యాచారం చేసిన వారు 139 మంది ఉన్నారని ఆ 139 మందిలో కొద్ది మంది సెలబ్రిటీలు కూడా ఉన్నారని అని చెప్పిన సంగతి తెలిసిందే. చాలాసార్లు గ్యాంగ్ రేప్ చేశారనీ గర్భం దాల్చితే అబార్షన్ చేయించారని తనను నగ్నంగా ఫొటోలు వీడియోలు తీశారనీ సిగరెట్ల తో వాతలు పెడుతూ… హింసించారని బాధితురాలు తెలిపింది. ఎవరికైనా చెబితే… చంపుతామని గన్ తో బెదిరించారని వివరించింది. అత్యాచారానికి పాల్పడిన వారిలో రాజకీయ నేతల పీఏలు విద్యార్థి సంఘాల నాయకులు టాలీవుడ్ నటులు కూడా ఉన్నారని బాధితురాలు ఆరోపించింది. వాళ్ల నుంచి తనకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇచ్చింది.కొంత మందితో తనకు ఎలాంటి సంబంధం లేదని తాను ఎంత చెప్పినా వినకుండా అనవసరంగా ఆ కేసులో డాలర్‌ బాయ్ ఆ పేర్లను రాయించాడని తెలిపింది. తనను, తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడని, చిత్ర హింసలకు గురి చేశాడని తెలిపింది. తనపై అత్యాచారం జరిగింది నిజమే కానీ, ఇందులో సెలబ్రిటీలు లేరని ఆమె చెప్పింది. యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడులకు అసలు సంబంధం లేదని ఆమె పేర్కొంది.తాను బయటవారి చేతిలో 50 శాతం వేధింపులకు గురయితే, మరో 50 శాతం వేధింపులకు డాలర్‌ బాయ్ వల్లే గురయ్యానని చెప్పింది. తన వల్ల ఇబ్బందులు పడ్డవారికి క్షమాపణలు చెబుతున్నానని పేర్కొంది. తనలా మరో అమ్మాయికి అన్యాయం జరగకూడదని, డాలర్ బాయ్ తనలా మరో ఇద్దరిని కూడా ట్రాప్ చేశాడని ఆమె ఆరోపించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos