పార్టీ మారడంపై భూమా బ్రహ్మానందరెడ్డి క్లారిటీ

పార్టీ మారడంపై భూమా బ్రహ్మానందరెడ్డి క్లారిటీ

కర్నూలు: గత కొద్దిరోజులుగా భూమా ఫ్యామిలీ టీడీపీని వీడి జనసేనలో చేరుతున్నట్లు సోషల్ మీడియా, టీవీ చానెళ్లలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై శుక్రవారం రోజు మంత్రి భూమా అఖిల ప్రియ స్పందించి జనసేనలో చేరాల్సిన ఖర్మ మాకు పట్టలేదని క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేస్తానని, విజయాన్ని చంద్రబాబుకు కానుగా ఇస్తానని మంత్రి తెలిపారు. తాజాగా నంద్యాల భూమా బ్రహ్మానందరెడ్డి పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించారు.

భూమా బ్రహ్మానంద క్లారిటీ..
టీడీపీని వీడుతున్నట్లు వచ్చిన వార్తలన్నీ అవాస్తవమని ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కొట్టిపారేశారు. నియోజకవర్గంలోని గోస్పాడు మండలంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..మా ప్రాణం ఉన్నంత వరకు భూమా ‌కుటుంబం టీడీపీలోనే కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. భూమా కుటుంబ రాజకీయ ప్రస్థానం టీడీపీతోనే మొదలైందని.. టీడీపీతోనే ముగుస్తుందని బ్రహ్మానంద రెడ్డి స్పష్టం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos