‘కరోనా తో యుద్ధం క్లిష్టమైనది

‘కరోనా తో యుద్ధం క్లిష్టమైనది

ముంబై :దేశం నుంచి కరోనా 21 రోజుల్లో మాయం అవుతుందని ప్రధాని మోదీ చెప్పింది కల్లైందని శివసేన పత్రిక సామ్నా విమర్శించింది. ‘కరోనాపై జరుగుతోన్న ఈ యుద్ధం మహాభారతంలోని కురు క్షేత్ర యుద్ధం కంటే క్లిష్టమైనది. భారత యుద్ధం 18 రోజుల్లో ముగిసింది. మార్చిలో మోదీ కరోనా గురించి మాట్లాడుతూ 21 రోజుల్లో దీనిపై విజయం సాధిస్తామని చెప్పారు. 100 రోజులు దాటి పోయింది.. కరోనా ఇప్పటికీ పెరిగిపోతూనే ఉంది. దీనిపై పోరాడుతున్న వారు అలసి పోతు న్నార’ని పేర్కొంది. ‘ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలని కలలు కంటోన్న భారత దేశంలో ప్రతిరోజు కరోనా కేసులు దాదాపు 25,000 నమోదు అవుతుండడం దురదృష్టకరం. అత్యధిక కరోనా కేసుల్లో మనం ఇప్పటికే రష్యాను కూడా దాటేశాం. కరోనా కేసులు ఇలాగే పెరుగుతూ పోతే ఈ జాబితాలో మనం ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుకుంటాం. 2021లోపు కరోనా వైరస్కు వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదు. అప్పటి వరకు మనం ఈ వైరస్తోనే సహజీవనం చేయాల్సి ఉంద’ని చెప్పింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos