కోల్కతా: ‘ ప్రతి ఒక్కరూ శాంతిని కాపాడాల’ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేసారు. ముఖ్యమంత్రిగా ప్రమాణాన్ని చేసిన తర్వాత రాజభవన్లో విలేఖరులతో మాట్లాడారు. ‘ఏ పార్టీకి చెందినవారైనా హింసకు పాల్పడితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నేను శాంతియుత వాతావరణానికి మద్దతు పలుకుతున్నా దానినే కొనసాగిస్తాన’న్నారు. ఈ సందర్బంగా గవర్నర్ జగదీప్ కూడా మాట్లాడారు. ‘మమతా బెనర్జీ రాజ్యాంగాన్ని గౌరవిస్తారు. హింసాయుత ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాన’న్నారు.