ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు

ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు

హొసూరు : కృష్ణగిరి జిల్లా గుమ్మలాపురం సమీపంలో పొలం లో పనిచేస్తున్న ఓ రైతుపై ఎలుగుబంటి దాడి చేయడంతో  తీవ్రంగా గాయపడ్డాడు.  స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  గుమ్మలాపురం సమీపంలోని బేలకరై గ్రామానికి చెందిన రైతు చిక్కన్న ఆదివారం తన పొలంలో పొలం పనులు నిర్వహిస్తుండగా సమీపంలోని అటవీ ప్రాంతం నుండి వచ్చిన ఎలుగుబంటి దాడి చేసింది. చిక్కన్న అరుపులు విని సమీపంలోని గ్రామస్తులందరూ కలసి అతనిని  కాపాడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిక్కన్న ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

తాజా సమాచారం