బాక్సైట్ తవ్వకాల నిలిపివేత

బాక్సైట్ తవ్వకాల నిలిపివేత

అమరావతి: బాక్సైట్ తవ్వకాల్ని నిలిపేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఇక్కడ జరిగిన పోలీసుఅధికార్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘గిరిజనులు వద్దన్నప్పుడు తవ్వకాలు చేయడంలో అర్థం లేదు. ఆ తవ్వకాలు జరగకపోతే రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏమీ లేద’న్నారు. రాష్ట్రానికి ప్రస్తుతం శాంతి, ప్రశాంతత ముఖ్యం అని గుర్తించుకోవాలని సూచించారు. గిరిజనులు మావోయిస్టులుగా మారకుండా ఆయా ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గిరిజనుల జీవనోపాధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos