ఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన అధికారుల సంఘాలు ఈ నెల 26, 27 తేదీల్లో జరుపతలపెట్టిన సమ్మెను వాయిదా వేసుకున్నాయి. తమ డిమాండ్లపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ సానుకూల స్పందన వ్యక్తం చేయడంతో సమ్మెను వాయిదా వేసుకున్నట్లు సంఘాల నాయకులు తెలిపారు. నాలుగు బ్యాంకు అధికారుల సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బ్యాంకుల మహా విలీనాన్ని నిరసిస్తూ రెండు రోజుల సమ్మెకు దిగాలని సంఘాలు నిర్ణయించాయి. దీంతో పాటు తమ ఇతర డిమాండ్లను పరిశీలించడానికి ఓ కమిటీని నియమిస్తామని రాజీవ్ కుమార్ హామీ ఇచ్చినట్లు తెలిపాయి.