ముంబై: అత్యవసరం అయితే తప్ప బ్యాంకులకు వెళ్లరాదని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీవో) ఖాతాదారులకు సోమ వారం విజ్ఞప్తి చేసింది. వీలైనంత వరకు అన్ని సేవలు అందిస్తామని తెలిపింది. మొబైల్, ఆన్లైన్ బ్యాకింగ్ ద్వారా ఉన్న నాన్ -ఎస్సెన్షియల్ సేవలను ఉపయోగించు కోవాలని కోరింది. 24 గంటలూ ఆ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. అవసరమైనపుడు బ్యాంకులకు ఫోన్ చేయాలని, ఐవీఆర్ సదుపాయాన్ని కూడా పొందొచ్చని పేర్కొన్నారు. నగదు జమ, ఉప సంహరణ, చెక్ క్లియరెన్స్, చెల్లింపులు, ప్రభుత్వపరమైన లావాదేవీలు వంటివి అందుబాటులో ఉంటాయని వివరించారు.