చాందస వాదుల్ని చిత్తు చేస్తాం

చాందస వాదుల్ని చిత్తు చేస్తాం

కోల్‌కతా: ‘మాతో పెట్టుకుంటే అంతే సంగతుల’ని పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమత బెనర్జి బుధ వారం కమల నాధుల్ని హెచ్చరించింది.నగ రంలో జరిగిన రంజాన్ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ‘త్యాగా నికి మారు పేరు హిందువులు. నిజాయతీకి నిదర్శనం ముస్లింలు. ప్రేమకు ప్రతి రూపాలు క్రైస్తవులు. సిక్కుల మారు పేరు బలిదానం. ఇదే పవిత్ర భారత దేశం. దీన్ని మేం రక్షించుకుంటాం. మమ్మల్ని ఢీ కొంటే నుగ్గు నుగ్గు అవుతారు. ఇదే మా హెచ్చరిక, నినాదం’ అని వ్యాఖ్యానించారు. ఈవీఎంలలో అవకతవకలు చేసి రాష్ట్రంలో తన ప్రాభవాన్ని చాటుకున్న భాజపా త్వరలోనే సూర్యుడి వలే అస్తమిస్తుందని దుయ్యబట్టారు. జై శ్రీరాం నినాదాలతో భాజపా కార్యకర్తలు నిరసించటాన్ని గర్హించారు. ఈ విధానం బంగ ప్రజల సంస్కృతి కాదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి పనని ఆరోపించారు. దరిమిలా జై శ్రీరాంతో పాటు ,జై మహా కాళీ నినాదాలు కూడా చేస్తామన్నారు. జై శ్రీరాంకి టీఆర్‌పీ రేటింగ్ తగ్గినందున జై మహా కాళీ’ నినాదాన్ని భుజానికి ఎత్తుకున్నారని టీఎంసీ కీలక నేత, మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్‌ బెనర్జీ ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో మత జోక్యాన్ని భాజపా పెంచి పోషిస్తుందని ఆరోపించారు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. మమత వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos