ఏలూరు : కుల దూషణ కేసులో నిందితుడైన తెలుగు దేశం పార్టీ ప్రముఖుడు, దెందులూరు మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ కు బెయిల్ మంజూరుకు ఇక్కడ న్యాయ స్థానం నిరాకరించింది.ఇంకా ఆయన న్యాయ నిర్బంధాన్ని అక్టోబర్ తొమ్మిది వరకూ పొడిగించింది. 2017లో అప్పన పాడు గ్రామంలో ఒక స్థల వివాదంలో దళితుడు ఒకరిని నిర్బంధించి కులం పేరిట దూషించారనే ఆరోపణపై చింతమ నేనికి వ్యతిరేకంగా కేసు దాఖ లైంది. ఎస్సీ, ఎస్టీలపై దౌర్జన్యం నేరారోపణ కింద ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు.