కడప: వంచన కేసులో తెలుగు నటుడు, నిర్మాత బండ్ల గణేష్కు కడప న్యాయస్థానం 14 రోజుల నిర్బంధాన్ని విధించింది. రిమాండ్ను విధించింది. 2011లో కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి వద్ద బండ్ల గణేష్ రూ.13 కోట్ల అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చేందుకు ఇచ్చిన బ్యాంకు చెక్ చెల్లు బాటు కాక పోవటంతో బండ్ల గణేష్కు వ్యతిరేకంగా 2013 మహేష్ వ్యాజ్యాన్ని దాఖలు చేసారు. కడప పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు విచా రణకు హాజరు కాక పోవటంతో కడప జిల్లా మేజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు . బుధవారం ఆయన్ను హైదరాబాదులో అరెస్టు చేసిన పోలీసులు గురువారం ఇక్కడ న్యాయస్థానంలో విచారణకు హాజరు పరచారు.