అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలోనే విద్యా బోధన ముసాయిదాను గురువారం దిగువ సభ ఏకగ్రీవంగా ఆమోదిం చింది. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మాట్లాడారు. ‘ప్రాథమిక స్థాయి నుంచీ ఆంగ్లంలోనే విద్యా బోధన అవసరం. పేద విద్యార్థుల కోసం ఇంగ్లీష్ హక్కు విధానాన్ని తీసుకొచ్చాం. ఈ ముసాయిదాను ఎగువ సభలో విపక్షాలు అడ్డుకు న్నాయి. కొన్ని సవరణల్ని ప్రతిపాదించి ముసాయిదాను ఇక్కడకు తిప్పి పంపారు. సవరణల్ని ఖాతరు చేయకుండా ముసా యి దాను యథాతథంగా ఆమోదించి ఎగువ సభకు పంపుతున్నాం. మండలి ముసాయిదాను తిరస్కరించినా అది చట్టంగా మారుతుంద’ని చెప్పారు.