గాంధీ నగర్: రాజ్యసభ ఎన్నికల వేళ సొంత పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వెన్ను పోటు పొడిచారు. గురువారం కర్జాన్ ఎమ్మెల్యే అక్షయ్ పటేల్, కప్రాద ఎమ్మెల్యే జితూ చౌదరి తమ పదవులకు రాజీనామా చేశారు. గత మార్చిలో ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. 182 మంది సభ్యులున్న గుజరాత్ శాసనసభలో భాజపా సభ్యులు 103. కాంగ్రెస్ సభ్యులు 66 మంది. వచ్చే 19న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. భాజపా తరపున అభయ్ భరద్వాజ్, రమిలా బరా, నరహరి అమిన్, కాంగ్రెస్ అభ్యర్థులుగా శక్తి కాంత్ గోహిల్, భరత్ సింగ్ సోలంకి పోటీ చేస్తున్నారు.