న్యూ ఢిల్లీ : విస్తృత సంప్రదింపుల తర్వాతే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని జమ్ము-కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం పరిధి పాక్ ఆక్ర మిత కశ్మీర్ (పీవోకే)కూ వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్ సోమవారం రాజ్యసభలో తెలిపారు. విస్తృత సంప్రదింపుల తర్వా తే 370 అధీకరణ రద్దు చేసామన్నారు. జమ్ము-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి ఉండటం ఎన్నో పురోగామి చట్టాలకు అడ్డంకిగా మారిందన్నారు. ఎస్పీ, ఎస్టీ, మహిళలకు సమాన అవకాశాలకు ఆర్టికల్ 370 రద్దు తప్పనిసరని గట్టిగా సమర్థించుకున్నారు.370 అధీకరణను రద్దు చేస్తామని భాజపా ఎన్నికల ప్రణాళికలోనే భరోసా ఇచ్చిందని చెప్పారు. జన సంఘ్ కాలం నుంచే దీని పై చర్చ జరుగుతోందన్నారు.