అయోధ్య: అయోధ్యలో ఉగ్రవాదులు దాడి చేసే అవకాశా లున్నందున ప్రముఖ ఆలయాలకు మూడు వందల మంది మెరికల్లాంటి పోలీసు జవాన్లతో భద్రత కల్పించనుంది. ఇందుకు తగినచర్యల్నిచేపట్టాలని హోం శాఖ బరేలీ, కాన్పూర్, ప్రయాగ్రాజ్ జోన్ల ఏడీజీలను ఆదేశించింది. అవినీతి ఆరోపణలు లేని సమర్థులైన కానిస్టేబుళ్లను మాత్రమే ఎంపిక చేస్తారు. అయోధ్యకు చెందని జవాన్లనే ఎంపిక చేయాలని సూచించారు. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దుకు నిరసనగా పాకిస్తాన్, ఉగ్ర వాదుల నుంచి అవాంఛనీయాలు ఎదురు కావచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి.