సుష్మా మృతిపై భావోద్వేగానికి గురైన స్మృతి ఇరానీ..

సుష్మా మృతిపై భావోద్వేగానికి గురైన స్మృతి ఇరానీ..

కేంద్ర మాజీ మంత్రి  సుష్మా స్వరాజ్‌ మృతిపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.సుష్మా మృతిపై ట్విట్టర్‌లో భావోద్వేగమైన ట్వీట్‌ చేసి సుష్మాతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.సుష్మా స్వరాజ్‌ను దీదీ అని సంబోధిస్తూ ‘నాకు నీతో గొడవ పెట్టుకోవాలని ఉంది దీదీ బన్సూరీ(సుష్మ కుమార్తె)తో కలిసి నన్ను రెస్టరెంట్కు తీసుకెళ్తానని మాటిచ్చావు. ప్రామిస్ను నెరవేర్చకుండానే నువ్వు వెళ్లిపోయావుఅని స్మృతి ఇరానీ ట్వీట్చేశారు.వయసులోనూ, అనుభవంలోనూ సుష్మా స్వరాజ్…. స్మృతికి కన్నా పెద్ద. అందుకేస్మృతీసుష్మాని ప్రేమగా దీదీని అని పిలిచేవారు.ఈ క్రమంలో సుష్మాను దీదీ అని సంబోధిస్తూ ట్వీట్‌ చేశారు.చాలా కాలంగా స్మృతి,సుష్మాల మధ్య స్నేహబంధం కొనసాగుతోంది.గత ప్రభుత్వ మంత్రివర్గంలో మంత్రులుగా పని చేయడంతో స్మృతి,సుష్మాల మధ్య స్నేహం మరింత బలపడింది.దీంతో సుష్మా హఠాన్మారణంపై స్మృతి భావోద్వేగానికి గురయ్యారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos