చావుకు సిద్ధం: అవంతి

చావుకు సిద్ధం: అవంతి

విశాఖపట్టణం: తెలుగుదేశం పార్టీ బెదిరింపులకు భయపడేది లేదని, చావడానికైనా సిద్ధమని పార్లమెంటు సభ్యుడు, వైసీపీ నేత అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు.తను తెదేపాలోచేరకపోతే సింహాచలం భూములు తీసుకుంటామని ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. సింహాచలం భూములే ప్రధాన సమస్యగా పోరాడతానని, పంచ గ్రామాల సమస్యను ఎన్నికల ఎత్తుగడగా తెరపైకి తెచ్చారన్నారని విమర్శించారు. తెదేపా ఏలుబడిలో భీమ్లి వాసులు నానా కష్టాలు పడుతున్నారని ఆక్రోశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos