మోదీ ఆధునిక ఔరంగ జేబ్

మోదీ ఆధునిక ఔరంగ జేబ్

వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ ఆధునిక ఔరంగ జేబ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సంజయ్ నిరుపం అభివర్ణించారు. బుధవారం ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. వారణాసిలో కాశీ విశ్వనాథ్ రహదారి నిర్మాణానికి నగరంలోని ఎన్నో చిన్నచిన్న దేవాలయాలను, బిల్డింగులను కూల్చేశారని దుయ్యబట్టారు. బాబా విశ్వనాథ్ ఆలయాన్ని దర్శించే వారి నుంచి తలారూ. 550 వసూలు చేయాలని మోదీ ఆదేశించారని ఇది ఫీజు లేక జరిమానా కావచ్చని మండి పడ్డారు. ఆనాడు ఔరంగ జేబ్ చేయలేని పనులను ఇప్పుడు మోదీ చేస్తున్నారని నిరుపమ్ విమర్శించారు. ‘ఒకసారి కాశీ వీధుల్లోకి ఔరంగజేబ్ వచ్చి మన దేవాలయాలను కూల్చేసేందుకు యత్నించారు. స్థానికులు అడ్డుపడి దేవాలయాలను రక్షించుకున్నారు. అలాంటి నిరసనే ఇప్పుడు కూడా వారణాసి వీధుల్లో సంభవించే అవకాశం ఉందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos