రైల్వే స్టేషన్ పేరు మార్చిన ఆగంతకులు

రైల్వే స్టేషన్ పేరు మార్చిన ఆగంతకులు

ముంబై: ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారంపై ఉన్న నామఫలకంపై రంగు పూసి సంభాజీ నగర్ అని కొందరు ఆగంతకులు రాసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ఇది సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. ముగ్గురు వ్యక్తులు ఈ పనికి పాల్పడినట్లు వీడియోలో తెలిసింది. తొలుత వారు ఔరంగాబాద్ పేరు పై రంగు పూశారు. తరువాత దానిపై సంభాజీనగర్ అని రాశారు. గతంలోనూ ఇటువంటి ఘటనలు జరిగాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos