ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో వలస కూలీలు సోమవారం పోలీసులపై రాళ్లు, సీసాలతో దాడి చేశారు. లాఠీచార్జితో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తమ రాష్ట్రాలకు తమను తిరిగి పంపాలంటూ దాదాపు 300 మంది కూలీలు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ఆయా రాష్ట్రాల నుంచి అనుమతులు వచ్చేవరకు వారిని తిరిగి పంపబోమని పోలీసులు వారికి చెప్పారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్వస్థలాలకు పంపాల్సిందేనంటూ బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ కూలీలు డిమాండ్ చేసారు. ఇతర ప్రాంతాల్లోనూ జనాలు, కూలీలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు.