వృధ్ధునిపై వేట కొడవలితో దాడి

వృధ్ధునిపై వేట కొడవలితో దాడి

హోసూరు: భూ వివాదాల కారణంగా ఇక్కడకు సమీపంలోని సోమనాథపురం గ్రామానికి చెందిన వెంకటేశప్ప(65)పై పక్కింటి చంద్రు అనే వ్యక్తి బుధవారం సాయంత్రం వేట కొడవలితో దాడి చేసాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేశప్పను చికిత్స కోసం ఇక్కడి ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యాధికార్లు తెలిపారు. పరారీలో ఉన్న చంద్రు కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరి కుటుంబాల మధ్య చాలా కాలంగా భూ తగాదాలున్నాయి. దీంతో రెండు కుటుంబాల మధ్య తరకూ కలహాలు జరుగుతున్నాయి. బుధవారం సాయంత్రం గొడవ శ్రుతి మించటంతో కోపోద్రేకంతో చంద్రు తన చేతిలో ఉన్న వేట కొడవలితో వెంకటేశప్ప పై ఏకంగా దాడి చేసాడని పోలీసులు వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos