ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ ప్రయత్నం

ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ ప్రయత్నం

న్యూ ఢిల్లీ : రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మంత్రి అతిశీ తాజాగా ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు రాజకీయ కుట్ర జరుగుతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తమకు తెలిసిందని చెప్పారు. శుక్రవారం ఉదయం మీడియా సమావేశంలో అతిశీ మాట్లాడుతూ.. ‘ఎలాంటి ఆధారాలూ లేకుండా సీఎం అరవింద్ కేజ్రీవాల్ను తప్పుడు కేసులో అరెస్ట్ చేశారు. ఢిల్లీలో ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర జరుగుతోంది. గతంలో జరిగిన కొన్ని విషయాలు చూస్తే కుట్ర కోణం స్పష్టంగా తెలుస్తోంది’ అని మంత్రి అతిశీ పేర్కొన్నారు. కేజ్రీవాల్ ప్రైవేట్ సెక్రటరీని తొలగిచడం కూడా కుట్రలో భాగమేనని ఆమె ఆరోపించారు.ఢిల్లీలో గత కొన్ని రోజులుగా అధికార నియామకాలను చేపట్టడం లేదని అతిశీ తెలిపారు. వివిధ శాఖల్లో ఖాళీలు ఉన్నప్పటికీ ఢిల్లీలో సీనియర్ ఐఏఎస్ అధికారుల పోస్టింగ్లు కొన్ని నెలలుగా నిలిచిపోయాయని చెప్పారు. ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచీ అధికారులు సమావేశాలకు కూడా హాజరుకావడం మానేశారని మంత్రి వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos