అర్ధరాత్రి సంచలన నిర్ణయం..

అర్ధరాత్రి సంచలన నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి సంచలన నిర్ణయం తీసుకుంది.పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా జ్యూడిషియల్‌ రాజధాని కర్నూలుకు కొన్ని కీలక ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది.పాక్షిక న్యాయ విభాగమైన విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్ సభ్యుల ఆఫీస్లను కర్నూలుకు తరలిస్తున్నట్లు ఏపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు విభాగాలన్ని వెలగపూడి సచివాలయంలో ఉండగా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ఇవన్నీ కర్నూలుకు తరలించనున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. విభాగాలన్నింటికి అవసరమైన బిల్డింగ్లను ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ మరియు కర్నూలు కలెక్టర్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. న్యాయ, న్యాయ సంబంధిత కార్యాలయాలన్నింటిని కర్నూలులో పెడతామని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos