అమరావతి:‘రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ముచేయబోన’ని వైకాపా అధినేత, కాబోయే ముఖ్యమంత్రి జగన్ గురువారం ఫేస్ బుక్ లో రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో వైకాపా పట్ల ఆదరణ చూపిన రాష్ట్ర ప్రజానీకానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇది ప్రజావిజయం’ అని అభినందించారు.