న్యూ ఢిల్లీ : జోధ్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తన కుమారుడు వైభవ్ ఓడిపోవడానికి ఉపముఖ్యమంత్రి సచిన్ పైలటే కారణమని తాను తప్పు బట్ట లేదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారం ట్విటర్లో పేర్కొన్నారు. తన వ్యాఖ్యల్ని మాధ్యమాలు వక్రీకరించాయని చెప్పారు. ‘ఒక ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు నేను చెప్పిన సమాధానాలకు సంబంధం లేని విషయాలను జోడించి మాధ్యమాల్లో ఒక వర్గం అనవసర రాద్ధాంతం చేస్తోంద’ని తప్పు బట్టారు.