రాజమహేంద్ర వరం : ప్రైవేటు విద్యా వ్యవస్థకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ బుధవారం ఇక్కడ ప్రకటించారు. ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ధి చేసేందుకు, మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇక్కడి ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ విశ్వవిద్యాలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.