’మహా’ పోలీసుల్లో కేంద్రం గూఢ చారులు

’మహా’ పోలీసుల్లో కేంద్రం గూఢ చారులు

ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ రాష్ట్ర పోలీసులపై మండిపడ్డారు. మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ఎల్గార్ పరిషత్ కేసులో పోలీసుల పాత్రను ప్రశ్నించారు. ఈ కేసు దర్యాప్తును సిట్కు అప్పగించేందుకు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్లతో జరిగిన అంతర్గత సమావేశం సమాచారం కేంద్ర ప్రభుత్వానికి ఎలా తెలిసిందని నిలదీశారు. సమావేశంలో పాల్గొన్న వారిలో ఎవరో ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి ఉంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. ‘మహా రాష్ట్ర హోం శాఖను నేను సుమారు ఇరవయ్యేళ్ళు నిర్వహించాను. పోలీసులను చూసి గర్వించే వాడిని. అటువంటి పోలీసులు అధికార దుర్వి నియోగానికి పాల్పడటం ఆందోళనకరంగా ఉంది. ఎల్గార్ పరిషత్ కేసులో పుణే పోలీసులు, కొందరు సీనియర్ పోలీసు అధికారుల పాత్ర ప్రశ్నా పాత్ర ప్రశ్నార్థకం. ఆ పరిషత్లో పాల్గొనని వారిపైనా కేసులు పెట్టార’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos