200 మంది అరెస్టు

200 మంది అరెస్టు

గౌహతి: పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా అస్సాంలో ఇప్పటి వరకూ సంభవించిన అల్లర్లలో ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తతో పాటు దాదాపు 200 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో 136 మందికి వ్యతిరేకంగా కేసులు నమోదు చేశామని అస్సాం పోలీసు డైరెక్టర్ జనరల్ భాస్కర్ జ్యోతి మహంతా మంగళవారం ఇక్కడ వెల్లడించారు. ఇంకా రాష్ట్రమంతటా సుమారు మూడు వేలకుపైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిలో హింసకు పాల్పడుతున్న ప్రముఖ పార్టీల నేతలు ఉన్నారని తెలిపారు. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్న అనంతరం సలహాలు, సూచనలు విడుదల చేస్తున్నామని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos