హైదరాబాద్ : తెలంగాణలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. శుక్రవారం నుంచి 242 ఆస్పత్రుల్లో సేవలు అందడం లేదు. ఈ ఫథకానికి సంబంధించి ప్రైవేట్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లులు ప్రభుత్వం వద్ద చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. విధి లేక ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించారు. రూ.1,500 కోట్ల బకాయిలు చెల్లించాలని, ప్యాకేజీ రేట్లను సవరించాలని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రి యాజమాన్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.