ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే అమలవుతోన్న ఆరోగ్య శ్రీ పథకాన్ని ఇకపై మరింత విస్తృతం చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోని పలు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆ ప్రాంతాల్లోనూ ఆరోగ్యశ్రీ వర్తింపచేసే కార్యక్రమాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.అనంతరం చెన్నైలోని ఎంఐఓటీ, బెంగుళూరులోని ఫోర్టిస్ తో పాటు హైదరాబాద్లోని మెడ్కవర్ ఆసుపత్రుల వైద్యులతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.ఆయా ప్రాంతాల్లోని ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతోనూ మాట్లాడారు. ఏపీకి చెందిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. ఆరోగ్యశ్రీ ద్వారా 716 రోగాలకు ఆ నగరాల్లోనూ ఇకపై వైద్య సేవలు అందుతాయి.