నలుగురు క్రికెటర్లకు ‘అర్జున` సిఫార్సు

  • In Sports
  • April 27, 2019
  • 135 Views
నలుగురు క్రికెటర్లకు ‘అర్జున` సిఫార్సు

పూనమ్‌ యాదవ్‌

ముంబై : క్రీడాకారులకు ఇచ్చే అర్జున పురస్కారాల కోసం బీసీసీఐ నలుగురి పేర్లను సిఫార్సు చేసింది. వీరిలో జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, రవీంద్ర జడేజాలతో పాటు మహిళా క్రికెట్‌ జట్టు సభ్యురాలు పూనమ్‌ యాదవ్‌ ఉన్నారు. బీసీసీఐ జీఎం సాబా కరీం పాలకుల కమిటీతో సమావేశమై సిఫార్సు కోసం వీరి పేర్లను ఖరారు చేశారు. బుమ్రా ఈ మధ్య చక్కటి బౌలింగ్‌తో రాణిస్తున్నాడు. ప్రపంచ కప్పునకు ఎంపిక చేసిన జట్టులో స్థానం సంపాదించాడు. షమీ కూడా మెరుగైన బౌలింగ్‌ను ప్రదర్శిస్తూ ప్రపంచ కప్పు జట్టులో చోటు సాధించాడు. ఆల్‌రౌండర్‌ జడేజా నిలకడ ఆట తీరును ప్రదర్శిస్తూ ప్రపంచ కప్పు జట్టుకు ఎంపికయ్యాడు. ఇక లెగ్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలో కలిపి 136 వికెట్లు తీసుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos