ఇస్లామాబాద్ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పాకిస్థాన్ బుధవారం కశ్మీర్ సంఘీభావ దినం’గా రాజధాని ఇస్లామాబాద్ లో పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘కశ్మీర్ ప్రజలకు పాకిస్థాన్ అండగా ఉంది, ఇక ముందూ అండగానే ఉంటుంద’ని భరోసా ఇచ్చారు. కశ్మీరీ సోదరులకు అండగా పాక్ ప్రజలు నిలబడటాన్ని యావత్ ప్రపంచం గమనిస్తోందన్నారు. ఏ క్షణంలో కూడా కశ్మీరీ ప్రజలను పాకిస్థాన్ ఒంటరిగా వదిలిపెట్టదని పునరుద్ఘాటించారు. ‘కశ్మీరీలంతా పాక్ ప్రజలే వారి బాధలూ మన బాధలేన’న్నారు. కశ్మీరీలకు ఎప్పటికీ అండగా ఉంటామనే విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి గట్టిగా చెబుతున్నానని వ్యాఖ్యానించారు.