బీసీసీఐకి భారీ ఎదురుదెబ్బ..

  • In Sports
  • July 18, 2020
  • 123 Views
బీసీసీఐకి భారీ ఎదురుదెబ్బ..

ఐపీల్ నుంచి తమను తొలగించడాన్ని ప్రశ్నిస్తూ ఒకప్పటి హైదరాబాద్ జట్టు డెక్కన్ ఛార్జర్స్ వేసిన కేసులో బీసీసీఐకి భారీ ఎదురు దెబ్బ తగిలింది.2012లో రూ. 100 కోట్ల బ్యాంకు గ్యారంటీని చూపించలేదంటూ ఆరోపించిన బీసీసీఐ, దక్కన్ చార్జర్స్ ను రద్దు చేయగా, 2013లో సన్ నెట్ వర్క్ ప్రవేశించి, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ప్రకటించింది.తమ తొలగింపు అక్రమ నిర్ణయమని ఆరోపిస్తూ, డీసీహెచ్ఎల్ ముంబై కోర్టును ఆశ్రయించగా, రిటైర్డ్ జస్టిస్ సీకే ఠక్కర్ నేతృత్వంలో మధ్యవర్తిత్వ కమిటీని కోర్టు నియమించింది. ఆపై వాదనలు ప్రారంభం అయ్యాయి. ఎన్నో పెద్ద తప్పులకు జరిమానాలతో సరిపెట్టే బోర్డు, ఎంతో చిన్న తప్పుకే తమకు తీవ్రమైన అన్యాయం చేసిందని డీసీ వాదించింది. తమకు రూ. 8 వేల కోట్లు కట్టాలని డీసీ డిమాండ్ చేయగా, తమకే ఖర్చుల కింద రూ. 214 కోట్లు ఇప్పించాలని బీసీసీఐ కోరింది. అప్పటి నుంచి ఎనిమిది సంవత్సరాల పాటు సాగిన కేసులో చివరికి దక్కన్ చార్జర్స్ వాదనే నెగ్గింది. జట్టును రద్దు చేయడం సరైంది కాదంటూ నష్టపరిహారంగా రూ. 4,814.67 కోట్లతో పాటు ఆర్బిట్రేషన్‌ మొదలైన 2012నుంచి ఏడాదికి 10 శాతం వడ్డీ, ఖర్చులకు మరో రూ. 50 లక్షలు చెల్లించాలని ఆదేశించారు.ఈ తీర్పును సవాల్ చేయాలని బీసీసీఐ న్యాయ సలహాలు తీసుకుంటోంది. తీర్పు కాపీని పూర్తిగా పరిశీలించిన తరువాత దీన్ని సవాల్ చేసే విషయమై తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ సీఈఓ హేమంగ్ అమీన్ వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos