అమరావతి : సహకార వ్యవసాయ మార్కెటింగ్ సమితులో యాభై శాతం స్థానాల్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని ముఖ్య మంత్రి జగన్మోహన రెడ్డి సూచించారు. గురువారం ఇక్కడ వ్యవసాయ మార్కెటింగ్, సహకార శాఖల్ని సమీక్షించారు. పంట ప్రారంభంలోనే మద్దతు ధర ప్రకటించాలని అధికార్లను ఆదేశించారు. అక్టోబర్ చివరి వారంలోగా పప్పు ధాన్యాలకు మద్దతు ధర ప్రకటించాలని కోరారు. నియోజక వర్గాల్లో గోదాముల్ని కట్టాని సూచించారు. అన్ని పంటలకు ఈ-నామ్ అమలు చేయాలని, ఆరు నెలల్లో దళారి వ్యవస్థను రూపుమాపాలని సూచించారు.