ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.2.45లక్షల కోట్లు..

ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.2.45లక్షల కోట్లు..

రాష్ట్ర విభజన జరిగడంతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోందని తాజాగా రాష్ట్ర అప్పుల వివరాలు చూస్తే అర్థమవుతోంది.పెట్టుబడులు రాక ఆదాయా మార్గాలు లేక అప్పులపైనే ఆధారపడాల్సి వస్తోంది.దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు రూ.2.45లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆర్థికశాఖ వెల్లడించింది.ఈ రుణాలను వడ్డీతో సహా తీర్చాలంటే 2040 వరకూ సమయం పడుతుందని ఆర్థిక శాఖ తెలిపింది. బహిరంగ మార్కెట్ నుంచి తీసుకున్న రుణాలు, విదేశాల సాయం, నాబార్డ్, విద్యుత్ సంస్థల నుంచి తీసుకున్న రుణాలన్నీ కలుపగా, మొత్తం రూ. 2,44,941.30 కోట్ల రూపాయలుగా తేలింది.వీటిలో బహిరంగ మార్కెట్ నుంచి రూ. 1.55 లక్షల కోట్లు, కేంద్రం నుంచి తీసుకున్న రూ. 10,229 కోట్లు, చిన్న మొత్తాల పొదుపు ఖాతాల ద్వారా రూ. 12,504 కోట్లు, ప్రావిడెంట్ ఫండ్ తదితరాల నుంచి రూ. 14,767 కోట్లు, డిపాజిట్లు, రిజర్వ్ నిధులు రూ. 52,064 కోట్లు ఉన్నాయని ఆర్థిక శాఖ తేల్చింది. నాబార్డ్ నుంచి, ‘ఉదయ్’ పథకం కింద తీసుకున్న రుణాలను 2030-31 వరకూ తీర్చివేయవచ్చని, మిగతా మొత్తం తీరాలంటే, ఇంకో పదేళ్ల వరకూ పడుతుందని అంచనా వేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos