ఆగని ఏనుగుల దాడి : మరో రైతుకు తీవ్ర గాయాలు

ఆగని ఏనుగుల దాడి : మరో రైతుకు తీవ్ర గాయాలు

హోసూరు : హోసూరు ప్రాంతంలో ఏనుగుల అలజడి ఇంకా తగ్గుముఖం పట్టలేదు. అమాయక రైతులు వాటి బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా…హోసూరు సమీపంలోని బుక్కసాగరం గ్రామానికి చెందిన రైతు శెట్టియప్ప (75)  సోమవారం గ్రామం సమీపంలోని  పొలం వద్దకు వెళ్లాడు. ఆ ప్రాంతంలోని ముళ్ల పొదల్లో ఉన్న ఏనుగు శెట్టియప్పపై అకస్మాత్తుగా దాడి చేసింది. ఈ సంఘటనలో ఆయన గాయపడ్డాడు. అతి కష్టం మీద ఏనుగు బారి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికులు ఆయనను చికిత్స కోసం హోసూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారం రోజులు ముందు సూలగిరి ప్రాంతంలోని నల్లగానకొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై ఏనుగు దాడి చేయడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత కొద్ది రోజులుగా సూలగిరి ప్రాంతంలో సంచరిస్తూ రైతులపై దాడి చేస్తున్న ఏనుగును దట్టమైన ఆటవీ ప్రాంతానికి తరిమివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos