న్యూయార్క్: భారత దేశంలో మూడు వ్యవసాయ నల్ల చట్టాల రద్దును యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు ఆండీ లెవిన్ స్వాగతించారు. ‘ఒక సంవత్సరానికి పైగా నిరసనల తర్వాత భారత్లో ఇలా మూడు వ్యవసాయ బిల్లులు రద్దవ్వడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. కార్మికులు కలిసికట్టుగా ఉంటే కార్పొరేట్ ప్రయోజనాలను ఓడించగలరని చెప్పడానికి ఇదోక నిదర్శనం. వారు యావత్ భారత్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా పురోగతిని సాధించ గలరు’అని ఆండీ లెవిన్ ట్వీట్టర్లో పేర్కొన్నారు.