నిరాటంకంగా పద్మనాభుడి దర్శనం

నిరాటంకంగా పద్మనాభుడి దర్శనం

తిరువనంత పురం: ఇక్కడి ప్రఖ్యాత అనంత పద్మనాభస్వామి దర్శనం బుధవారం నుంచి భక్తులకు లభిస్తోంది. కరోనా వల్ల గత మార్చి 21 నుంచి దర్శనాలు నిలిపివేసారు. భౌతిక దూరం పాటించి స్వామి వారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తులు ఆన్లైన్లో దర్శనం టిక్కెట్లు బుక్ చేసు కోవాలని సూచించారు. రోజుకు 665 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తారు. ప్రతి రోజూ ఉదయం 8.00 నుంచి 11.00 గంటల వరకు, సాయంత్రం 5.00 గంటల నుంచి 8.30 గంటల వరకూ దర్శనం ఉంటుంది. భక్తులకు తీర్థం, ప్రసాదాల వితరణ లేదు. శఠగోపం కూడా పెట్టటం లేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos