ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ప్రపంచకప్లో ఐదు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు కావడంతో క్రికెట్ అభిమానులతో పాటు సినీతారులు కూడా ఐసీసీపై,టోర్నీపై సెటైర్లు వేస్తూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.వర్షం కారణంగా మ్యాచ్లు రద్దవుతుండడంతో నెటిజన్లు పలు రకాల మీమ్స్తో ఐసీసీపై విరుచుకుపడుతున్నారు.కనీసం ఏ కాలంలో ఎక్కడ మ్యాచ్ లు నిర్వహించాలో కూడా తెలియని స్థితిలో ఐసీసీ ఉందని అభిమానులు అంటున్నారు.అలాంటి ఐసీసీ ధోని ధరించిన గ్లవ్స్ పై రాద్ధాంతం చేస్తోంది. ShameOnICC పేరుతో అభిమానులు హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఇంగ్లాడ్ లో జరుగుతున్న ప్రపంచ కప్ మ్యాచ్ లని వెంటనే ఇండియాకు మార్చాలని బిగ్ బి అమితాబ్ బచ్చన్ సరదాగా డిమాండ్ చేశారు. వరల్డ్ కప్ వేదికని ఇండియాకు మార్చండి. తద్వారా వరుణ దేవుడు కూడా ఇండియాకు వస్తాడు. మా ప్రజలకు నీటి ఎద్దడి కష్టాలు కాస్తయినా తగ్గుతాయి అంటూ అమితాబ్ చమత్కరించారు.కివీస్, ఇండియా మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో టీమిండియా క్రికెటర్ కేదార్ జాదవ్ అసంతృప్తి కూడా వ్యక్తం చేశాడు. వర్షం ఇక్కడ కాకుండా కరువుతో అల్లాడుతున్న తమ రాష్ట్రం మహారాష్ట్రలో కురవాలని కోరాడు.తెలుగు చిత్ర పరిశ్రమ హీరో నితిన్ కూడా క్రికెట్కు వీరాభిమానే.అందుకే భారత్-న్యాజిలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో ఐసీసీపై అసహనం వ్యక్తం చేశాడు. ఈసారి ప్రపంచ కప్ ని వర్షానికి ఇచ్చేయాలని ట్వీట్ చేశాడు. ఐదు మ్యాచ్లు వర్షార్పణం కాగా ఆదివారం ప్రపంచమంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై కూడా వరుణుడు అనుమానాలు రేకెత్తిస్తున్నాడు.భారత్-పాకిస్థాన్ల మధ్య మ్యాచ్ జరుగనున్న మాంచెస్టర్లో వాతావరణం వేగంగా మారుతోందని వానమబ్బులు కమ్ముకుంటున్నాయని అక్కడి వాతావరణ శాఖ తెలపడంతో మ్యాచ్పై అనుమానాలు మొదలయ్యాయి..
shift the tournament WC 2019 to India .. we need the rain .. !!! 🤣🤣🤣 https://t.co/KcGAAEODyr
— Amitabh Bachchan (@SrBachchan) June 13, 2019