న్యూ ఢిల్లీ:పశ్చిమ బంగ ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింస ఉ గల కారణాల గురించి ఆరా తీసేందుకు కేంద్ర హోశాఖ గురువారం నలుగురు సభ్యుల నిజనిర్ధారణ సమితిని నియమించింది. దీనికి హోం శాఖ అదనపు కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. వీరంతా బంగకు బయలుదేరారు. హింసాత్మక ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. దీని గురించి బంగాల్ ప్రభుత్వం సమగ్ర నివేదికను పంప లేదని కేంద్రం తెలిపింది. నివేదిక పంపకపోతే తీవ్రంగా పరిగణిస్తామని బుధవారం హెచ్చరించింది.