అమిష పటేల్‌ పై వంచన కేసు

అమిష పటేల్‌ పై వంచన కేసు

రాంచి: ప్రముఖ బాలీవుడ్ నటి అమీషా పటేల్ కు వంచన కేసులో రాంచీ న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.అమీషా తనను మోసగించినట్లు నిర్మాత అజయ్ కుమార్ ఆరోపించారు. అమిషా ఇచ్చిన 2.5 కోట్ల చెక్ బౌన్స్ అయినందున ఆమెకు వ్యతిరేకంగా కేసు దాఖలు చేసారు. 2018లో దేశీ మ్యాజిక్ చిత్రాన్ని రూపొందించడానికి అమిషాకు రూ.3 కోట్లు రుణంగా ఇచ్చినట్లు నిర్మాత అజయ్ కుమార్ తెలిపారు. బకాయి తీర్చమన్న పుడల్లా కుంటి సాకులతో వాయిదా వేసినట్లు వివరించారు. కొన్ని రోజుల తరువాత అమీషా రూ.2.5 కోట్ల చెక్ ఇచ్చింది. ఈ చెక్కును బ్యాంకులో జమ చేసినప్పుడు అది బౌన్స్ అయింది. అమీషా మోసం చేసినట్లు ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. వివాహ కార్యక్రమంలో డ్యాన్స్ చేయడానికి రూ .11 లక్షలు తీసుకున్న అమిషా ఆ కార్యక్రమానికి రాకుండా పోయారని మొరాదాబాద్లో డ్రీమ్విజన్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని నిర్వహకుడు పవన్ వర్మ ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos