విజయవాడ: కృష్ణా జిల్లా నాగాయలంకలో గురువారం తెల్లవారు జామున సుమారు రెండు గంటల ప్రాంతంలో సంభవించిన విద్యుదాఘాతానికి ఒక గుడిసెకు నిప్పు అంటుకుంది.లోపల నిద్రిస్తున్న గోపాలస్వామి(60) అనే వృద్ధుడు అగ్నికి ఆహుతయ్యాడు. మరో ఎనిమిది గుడిసెలకు కూడా మంటలు అంటుకున్నాయని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పారు.