దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తారక్,చరణ్ల కాంబినేషన్లో నిర్మాత దానయ్య సుమారు రూ.400 కోట్ల అత్యంత భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో పలు సినీ ఇండస్ట్రీల నుంచి ప్రముఖ నటీనటులను ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే.తారక్కు జోడీగా బ్రిటన్కు చెందిన డైసీని ఎంపిక చేసుకోగా చరణ్కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ను ఎంపిక చేసుకున్న విషయం కూడా తెలిసిందే.తాజాగా అందిన సమాచారం ప్రకారం రామరాజు పాత్ర పోషిస్తున్న చరణ్ పక్కన సీత పాత్రను పోషిస్తున్న అలియా మరో వారం మూడు రోజుల్లో ఆర్ఆర్ఆర్ టీమ్తో జాయిన్ అవనున్నట్లు తెలుస్తోంది.ఆ ఇద్దరితో కనెక్టివిటీ పూర్తిగా ఉత్తర భారతం కనెక్టివిటీ అని అర్థమవుతోంది. అందుకే ఉత్తరాంధ్రలోని పలు అందమైన లొకేషన్లతో పాటు ఢిల్లీలో కూడా షూటింగ్ చేయడానికి చిత్ర బృందం సిద్ధమవుతున్నట్లు సమాచారం.చరణ్ – తారక్ సహా ప్రధాన తారాగణం అంతా ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు. అలాగే ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ నాయిక డైజీ కూడా షూటింగ్ లో పాల్గొనున్నట్లు సమాచారం..