ఒకేరోజు విడుదలకు మహేశ్‌ ఈగోనే కారణం!

  • In Film
  • October 15, 2019
  • 113 Views
ఒకేరోజు విడుదలకు మహేశ్‌ ఈగోనే కారణం!

వచ్చే ఏడాది సంక్రాంతికి ఒకేరోజున సరిలేరు నీకెవ్వరు,అల వైకుంఠపురములో రెండు భారీ చిత్రాలు విడుదల కావడం వెనుక మహేశ్ బాబు ఈగోనే కారణమని తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.సరిలేరు చిత్రం విడుదలైన ఒకరోజు తేడాతో అల వైకుంఠపురములో చిత్రాన్ని విడుదల చేసుకుంటామని నిర్మాతలు మరో నిర్మాత దిల్ రాజు ద్వారా అభ్యర్థించగా అందుకు మహేశ్ అంగీకరించలేదని సమాచారం.11వ తేదీ సరిలేరు విడుదలయ్యాక మూడు రోజుల అనంతరం అంటే 14వ తేదీన అల వైకుంఠపురము చిత్రాన్ని విడుదల చేసుకోవాలంటూ మహేశ్ స్పష్టం చేయగా అందుకు హాసిని సంస్థ అంగీకరించలేదట.దీంతో నొచ్చుకున్న మహేశ్ అల వైకుంఠపురములో చిత్రం విడుదలయ్యే రోజే సరిలేరు కూడా విడుదల కావాలంటూ తేల్చి చెప్పడంతో అల నిర్మాతలు సైతం 11వ తేదీన చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో ఒకేరోజు రెండు చిత్రాలు ఢీ కొట్టడానికి సిద్ధమయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos