కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలు అఖిలప్రియే

హైదరాబాదు: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలు మాజీ మంత్రి అఖిలప్రియేనని పోలీసులు తేల్చారు. కిడ్నాప్ సమయంలో ఆమె సోదరుడు జగత్విఖ్యాత్రెడ్డి అక్కడే ఉన్నట్లు, కేపీహెచ్బీలోని లోధా అపార్ట్మెంట్స్లోనే ప్రణాళిక రూపొందించినట్లు కీలక ఆధారాలు లభించాయని చెప్పారు. అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్రామ్, జగత్విఖ్యాత్రెడ్డి, ఆమె అనుచరుడు గుంటూరు శ్రీను ఈ నెల 2, 4 తేదీల్లో ప్రత్యేకంగా సమావేశమై కిడ్నాప్ చేసేందుకు రూ.10 లక్షలకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారంలో మరో 15 మందిని అరెస్టు చేసారు. దీంతో అరెస్టయిన వారి సంఖ్య 19కి చేరిందన్నారు. భార్గవ్రామ్ తల్లి కిరణ్మయి, సోదరుడు చంద్రహాస్ల ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos