నేను ఏ క్షణంలోనైనా పోవచ్చు…

నేను ఏ క్షణంలోనైనా పోవచ్చు…

కరీంనగర్‌ : తాను ఏ క్షణంలోనైనా మరణించవచ్చని వైద్యులు చెప్పారని ,అయినా తనకేం బాధ లేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ భయానక నిజాన్ని బయటపెట్టారు. కరీంనగర్‌లో భాజపా అభ్యర్థి లోక్‌సభకు ఎన్నిక కావడమే తనను బాధించిందని వాపోయారు. ఇక్కడ జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కరీంనగర్ లో ముస్లిం వ్యక్తి డిప్యూటీ మేయర్‌గా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు పరిస్థితి తారుమారైందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎంఐఎంకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదు, భాజపాకు మాత్రం ఓటేయవద్దని కోరారు. కరీంనగర్‌లో భాజపా బలపడడం తనకు బాధ కలిగిస్తోందన్నారు. అనారోగ్య కారణాలతో అక్బరుద్దీన్ లండన్‌లో చికిత్స చేయించుకొని ఇటీవలే తిరిగి వచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos