హైకోర్టులో కృష్ణంరాజు, అశ్వనీదత్‌ ల పిటిషన్‌

హైకోర్టులో కృష్ణంరాజు, అశ్వనీదత్‌ ల పిటిషన్‌

అమరావతి : ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములకు పరిహారాన్ని చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ నటుడు కృష్ణం రాజు, నిర్మాత అశ్వనీదత్ ఇక్కడి ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యాన్ని దాఖలు చేసారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణలో కోల్పోయిన తన 31 ఎకరాల భూమికి నష్ట పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కృష్ణం రాజు కోరారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం కృష్ణా జిల్లా కేసరపల్లిలో తమకున్న భూముల్లోని నిర్మాణాలు, పండ్ల తోటలకు ఎలాంటి పరిహారం చెల్లించకుండానే స్వాధీనం చేసుకునేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కౌంటర్ దాఖలు చేయాలని ఏఏఐ, ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ‘గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ల్యాండ్ పూలింగ్ కింద నేను 39 ఎకరాలు ఇచ్చా. ఆ సమయంలో ఎకరం ధర రూ.కోటి 54 లక్షలు. ఆ భూమికి సమానమైన అంతే విలువ కలిగిన భూమిని రాజధాని అమరావతిలో కేటాయిస్తామని సిఆర్డిఎ ఒప్పందం చేసుకుంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రాజధానిని వేరే చోటికి తరలించాలని నిర్ణయించిందని, దీంతో ప్రస్తుతం అమరావతిలో ఎకరం రూ.30 లక్షలు కూడా విలువ చేయని పరిస్థితి నెలకొంది. నేనిచ్చిన 39 ఎకరాలకు మొత్తం రూ.210 కోట్లు చెల్లించాల’ని అశ్వనిదత్ ని కోరారు. తన 39 ఎకరాల రిజిస్ట్రేషన్ విలువ ఎకరం రూ.కోటి 84 లక్షలకు చేరుకుందని, భూ సేకరణ కింద ఈ భూమికి 4 రెట్లు చెల్లించిన తర్వాతే ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా లేదా ఎపి ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టుకోవచ్చని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos