మోదీకి వాహనాల యజమానుల హెచ్చరిక

మోదీకి వాహనాల యజమానుల హెచ్చరిక

ముంబై: ‘ఇంధన ధరలను వెంటనే తగ్గించాలి. లేదంటే దేశవ్యాప్తంగా స్ట్రైక్ చేస్తామ’ని ఏఐఎంటీసీ మోదీ సర్కార్ను హెచ్చరించింది. 14 రోజుల్లోగా డిమాండ్లు నెరవేర్చాలని గడువు ఇచ్చింది. పెట్రోల్ ధర ఆకాశాన్ని తాకుతోంది. సెంచరీ కొట్టేందుకు రెడీగా ఉంది. లీటరు పెట్రోల్ ధర రూ.97 చేరువలో ఉంది. ప్రీమియం పెట్రోల్ లీటరుకు రూ.100 చెల్లించాల్సిందే. పెట్రోలో రేటు మాత్రమే కాకుండా డీజిల్ ధర కూడా ఇదే దారిలో నడుస్తోంది. డీజిల్ ధర కూడా రూ.90 దిశగా దూసుకువెళ్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా సామాన్యులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఎక్కువ చార్జీల చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, వీటిపై అధిక పన్నులకు నిరసనగా దేశవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని ప్రకటించారు. డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతూనే వస్తున్నాయని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ తెలిపింది. అధిక పన్నులు, ఇవే బిల్లు, స్క్రాపేజ్ పాలసీ వంటి పలు అంశాల గురించి చర్చ జరిగిందని ఏఐఎంటీసీ తెలిపింది. ఏఐఎంటీసీలో దాదాపు 95 లక్షల ట్రక్ ట్రైవర్లు, దాదాపు 50 లక్షల మంది బస్సు డ్రైవర్లు, టూరిస్ట్ ఆపరేట్లు సభ్యులుగా ఉన్నారు.ఏఐఎంటీసీ కేంద్రానికి 14 రోజుల నోటీస్ పీరియడ్ ఇచ్చింది. ఈలోగా ఏఐఎంటీసీ డిమాండ్లు నెరవేర్చాలని లేదంటే దేశవ్యాప్త ధర్నాకు దిగుతామని హెచ్చరించింది. డీజిల్ ధరలను వెంటనే తగ్గించడం సహా ఇవే బిల్లు, జీఎస్టీ, స్క్రాపేజ్ పాలసీ వంటి అమలుకు ముందు ఏఐఎంటీసీతో చర్చలు జరపడం వంటివి డిమాండ్లుగా ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos