న్యూ డిల్లీ: శ్వాస కోస సమస్యతో తీవ్రంగా బాధపడుతున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మెరుగైన వైద్యం కోసం సోమవారా అర్థరాత్రి దాటిన తర్వాత రెండు గంటలకు -మంగళవారం ఇక్కడి ఎయిమ్స్ కు తరలించారు. కరోనా బారిన పడిన ఆయనకు గురుగ్రాంలోని మేదాంత ఆసుపత్రిలో రెండు వారాలుగా చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే కరోనా నుంచి విముక్తి పొందినట్లు అమిత్ షా ప్రకటించారు. ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడేవరకు మేదాంత ఆసుపత్రిలోనే చికిత్స తీసుకోవాలని అనుకున్నారు. శ్వాస కోస సమస్య తలెత్తటంతో హడావుడిగా ఆయన్ను ఎయిమ్స్ కు తరలించారు.